బొగోటా: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో (Colombia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. తీవ్రమైన పొగమంచు కారణంగా మూలమలపు వద్ద డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రేవు పట్టణమైన ముమాకో నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.