నాగర్కర్నూల్ : వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో విషాదం నెలకొంది. తండా సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగు శబ్దం విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను నీనావత్ నాన్కు, నీనావత్ రుక్మిణిగా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.