న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రోడ్డు ప్రమాదాల వల్ల 2019లో భారతదేశం దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టపోయిందని బాష్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.35% అని తెలిపింది. దేశంలో 20 ఏండ్లలో జరిగిన ప్రమాదాలపై సంస్థ విశ్లేషణ జరిపింది. రోడ్డు భద్రతా విధానాల రూపకల్పన, వ్యాపార వ్యూహాలు, కొత్త టెక్నాలజీతో ఉత్పత్తులకు ఈ విశ్లేషణ దోహదపడుతుందని పేర్కొన్నది. ప్రమాదాల కారణంగా సంభవించిన మానవ నష్టం, ఆర్థిక నష్టం, ఉత్పత్తి వ్యయం, గాయాలకు వైద్యం కోసం పెట్టిన ఖర్చు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నష్టాన్ని అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం..