భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బన్వర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జబెరా ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ లోధి పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. మృతులు 30 ఏండ్ల జోగేంద్ర సింగ్, అరవింద్ జైగా గుర్తించారు. తుపాకీ కాల్పుల్లో జోగేంద్ర సింగ్, రాళ్లు, కర్రలతో కొందరు దాడి చేయడం వల్ల అరవింద్ జై మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అరవింద్ జైన్ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తి అని, జోగేంద్ర సింగ్ ఈ పార్టీకి అతిథిగా ఆహ్వానించిన ఉపాధ్యాయుడని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణ జరిగినప్పుడు ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ అక్కడ లేరని దామోహ్ ఎస్పీ హేమంత్ చౌహాన్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.