ఇంఫాల్: ఓ బీజేపీ నేత కరోనాతో మరణించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన జర్నలిస్టు కిశోర్చంద్ర వాంఖెమ్ను, రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లైచెంబామ్ను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సఖోమ్ తికేంద్రసింగ్ కరోనాతో మరణించారు. అంకుముందుక ఆవు పేడ వంటికి రాసుకుంటే, గోమూత్రం తాగితే కరోనా రాదని, నయమవుతుందని తెలిపే పోస్టులు సమాజిక మాధ్యమాల్లో హోరెత్తాయి. ఈ నేపథ్యంలో అరెస్టయిన నిందితులు “ఆవుపేడ, గోమూత్రం పనిచేయలేదా” అని పోస్టులు పెట్టారు. మృతుడు తికేంద్రసింగ్ రిటైర్డు ప్రొఫెసర్. విద్యాధికుడైన వ్యక్తి మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం సరికాదన్న ఉద్దేశంతో ఇద్దరూ ఆ పోస్టులు పెట్టారు. మణిపూర్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఉషమ్ దేబన్, ప్రధాన కార్యదర్శి పీ ప్రేమానంద మీటెయ్ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టులు జరిగాయి. జర్నలిస్టు వాంఖెమ్ను గతంలో రెండు సార్లు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు.