కర్ణాటక : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం వేర్వేరు ఘటనల్లో బంగారం అక్రమ రవాణాను బహిర్గతపరిచారు. మూడు వేర్వేరు కేసుల్లో రూ.1.3 కోట్ల విలువైన 2.8 కేజీల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. మూగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను ముహ్మద్ అష్రఫ్, రాజేశ్, మహమ్మద్ కలంద్గా గుర్తించారు. షార్జా నుంచి అష్రప్ తన పాదం అడుగుభాగంలో బంగారాన్ని అక్రమ రవాణా చేశాడు. గో ఎయిర్ ఫ్లైట్లో వచ్చిన మరో ప్రయాణికుడు రాజేశ్ బంగారాన్ని నాలుగు గుళికల రూపంలో తన పురీషనాళంలో రవాణా చేశాడు. మూడో ప్రయాణికుడు మహమ్మద్ కలంద్ను నిఘావర్గాల సమాచారం మేరకు అరెస్టు చేశారు. ఇతడు షార్జా నుండి గో ఎయిర్ విమానంలో వచ్చాడు. బంగారాన్ని తన కాళ్ల క్రింద అతుక్కుని ఉంచి స్మగ్లింగ్ చేశాడు.