న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది.