ముంబై : మహారాష్ట్రలోని జైళ్లలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. సుమారు 198 మంది ఖైదీలు, 86 మంది సిబ్బంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారని ఆ రాష్ట్ర జైళ్ల విభాగం గురువారం ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వైరస్ బారినపడి ఏడుగురు ఖైదీలు, ఎనిమిది మంది సిబ్బంది మరణించారని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 1,326 మంది ఖైదీలు, 3,112 మంది జైలు సిబ్బందికి టీకాలు వేసినట్లు జైళ్లశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బుధవారం కొత్తగా 58,952 కొవిడ్ కేసులు నమోదవగా.. 278 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.