Crypto Currencies | గతేడాది కాలంలో అత్యధిక సంపన్నులైన భారతీయులు 18 శాతం మంది క్రిప్టో కరెన్సీలలు, ఎన్ఎఫ్టీ (నాన్ పంగిబుల్ టోకెన్లు – non-fungible tokens)ల్లో పెట్టుబడులు పెట్టారు. ఆయా పెట్టుబడుల మొత్తం విలువ మూడు కోట్ల డాలర్లు (సుమారు రూ.226 కోట్లు), అంతకంటే ఎక్కువేనని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. మంగళవారం ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 18 శాతం గ్లోబల్ సంపన్నులు, 11 శాతం ఎన్ఎఫ్టీల్లో పెట్టుబడులు పెట్టారు. భారతీయుల్లో 18 శాతం క్రిప్టో అసెట్లలో మదుపు చేశారు. వాటిలో 10 శాతం పెట్టుబడులు క్రిప్టో కరెన్సీలు, మిగతా 8 శాతం ఎన్ఎఫ్టీల్లో ఇన్వెస్ట్ చేశారు.
ఎకనమిస్ట్ మ్యాగజైన్ ప్రకారం 2021 చివరినాటికి క్రిప్టో కరెన్సీల్లో ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.4 లక్షల కోట్ల డాలర్లు. ఇది 2020 ప్రారంభంతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం 8000 క్రిప్టో కరెన్సీ టోకెన్లు చలామణిలో ఉన్నాయి. గతేడాది క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ప్రధాన స్రవంతిలోకి వచ్చి చేరాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఒడిదొడుకులు ఉన్నా, చాలా మంది ట్రేడర్లు వాటి పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించింది.