చండీగఢ్ : బ్లాక్ ఫంగ్ పంజా విసురుతోంది. శుక్రవారం హర్యానాలో 133 కేసులు నమోదవగా.. 18 మంది మంది ఒకే రోజు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 756 పెరగ్గా.. ఇందులో 648 మంది రోగులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 58 మంది రోగులు కోలుకోగా.. 50 మంది మృతి చెందారు. ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు అంబాలాలో అంబాలా ఏడు, భివానీ 9, ఫరీదాబాద్ 48, ఫతేహాబాద్ 12, గురుగ్రామ్ 216, హిసార్ 179, ఝాజ్జర్ 13, కైతాల్-యమునానగర్-కురుక్షేత్రలో 2, కర్నల్ 27, నుహ్ 14, పంచకుల 5, పానిపట్ 34, రేవారి 5, రోహ్తక్ 145, సిర్సాలో 39 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కొరత హర్యానాలో తీవ్రంగా ఉన్నది. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కరోనా డోసులకు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో ఐదోవంతు మాత్రమే అందాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను నివారించేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్ను ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్ కోటి డోసులు, 15వేల బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కోసం టెండర్ జారీ చేసింది.