ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని సింధునదిలో ప్యాసింజర్ వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహిళలు, పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 16 మంది ఉన్నారని, వ్యాన్ చిలాస్ నుంచి రావల్పిండికి వెళ్తుండగా చోటు చేసుకుందని కోహిస్తాన్ కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. టూర్ కోసం ఓ కుటుంబం వ్యాన్ను అద్దెకు తీసుకుందని పోలీసులు చెప్పారు. డ్రైవర్తో సహా 17 మందితో ఉన్న వ్యాన్ పానిబా ప్రాంతానికి సమీపంలో నదిలో పడిపోయిందని పేర్కొన్నారు.
ఓ మహిళ మృతదేహం నది ఒడ్డున పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా.. సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ను గుర్తించి వెలికి తీసిన అందులో మృతదేహాలు లభించలేదని తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని, నది ప్రవాహం ఎక్కువ ఉందని.. దీంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనపై గిల్గిత్, బాల్టిస్తాన్ సీఎం ఖలీద్ ఖుర్షీద్ విచారం వ్యక్తం చేశారు.