న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 162 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వ్యాక్సినేషన్ను గతేడాది జనవరి 16న ప్రారంభించారు. విడతల వారీగా వ్యాక్సినేషన్ చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం 15-18 ఏండ్ల మధ్యవయస్కులకు టీకా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. మార్చి నెలలో 12 నుంచి 15 ఏండ్ల బాలలకు వ్యాక్సిన్ పంపణీని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది.
కాగా, దేశంలో ఇప్పటివరకు 88,57,74,825 మంది మొదటి డోసు వేయగా, 68,39,22,086 మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. ఇక 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లలో 4,15,77,103 మందికి వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వగా, 80,10,256 మందికి ప్రికాషనరీ డోస్ పంపిణీ చేశారు. మొత్తంగా వ్యాక్సినేషన్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో 24,78,08,474 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో 14,60,43,724 డోసులను పంపిణీ చేశారు.