హైదరాబాద్, డిసెంబర్ 8: దేశంలో అతిపెద్ద జనరిక ఔషధ విక్రయ సంస్థ జెనెరికార్ట్ తన తొలి స్టోర్ను హైదరాబాద్లో ఆరంభించింది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ శ్రీపాద్ మాట్లాడుతూ..వినియోగదారులకు నాణ్యమైన జనరిక్ మందులను అందించాలనే ఉద్దేశంతో ఈ స్టోర్ను ఆరంభించినట్లు, ముఖ్యంగా ఈ ఔషధి కేంద్రంలో 30-70 శాతం వరకు తక్కువ ధరకే బ్రాండెడ్ మెడిసిన్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఐదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,500 ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వీటిలో ఒక హైదరాబాద్లోనే 300 స్వస్థ్ ఔషధి సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుండటం విశేషం.