ప్రతి సెగ్మెంట్కు 1500 దళితబంధు యూనిట్లు
పదిరోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
వచ్చే నెల 11న జాబితా ప్రదర్శిస్తాం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కలెక్టరేట్లో పలు పథకాలపై అధికారులతో సమీక్ష
‘డబుల్’ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
దళితుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. నిన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఓనర్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. దళితులకు సర్కారు మరో శుభవార్త చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లను సర్కారు మంజూరు చేసింది. పదిరోజుల్లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, వచ్చే నెల 11న అన్ని నియోజకవర్గాల్లో జాబితా ప్రదర్శిస్తాం. పథకంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. అత్యంత పారదర్శకంగా అందిస్తున్నాం. దళితులు సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నతంగా ఎదగాలి.
– కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితులు ఉన్న తవర్గాలకు దీటుగా ఎదగాలని, ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1,500 దళితబంధు యూనిట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం నుంచి పది రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వచ్చే నెల 11న అన్ని నియోజకవర్గాల్లో జాబితాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలు శాఖల ప్రగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. బ్యాంక్ లింకేజీ లేకుండా మార్టిగేజ్ లేకుం డా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతా ల్లో రూ.10 లక్షల నగదు జమ చేస్తున్నారని చెప్పారు. దళితులు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు సీఎం కేసీఆర్ను ఆయన అభినందించారు.
ఈ పథకంతో దళితులు భవిష్యత్ తరాల్లో ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని చెప్పారు. వాహనాలు, డెయిరీ, ఫౌల్ట్రీ, కిరాణా దుకాణాలు, సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని దళితులు వాటికి యజమానులుగా మారుతున్నారని వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకుని ఇప్పటివరకు 10,202 మందికి యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, ఇంకా 3,357 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా గ్రౌండింగ్ చేస్తున్నామని, ప్రస్తుతం ప్రతి నియోజవర్గానికి 1,500 యూనిట్లు మంజూరు చేశామని, మంగళవారం నుంచి పది రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వచ్చే నెల 11న జాబితా ప్రదర్శిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు. జిల్లాలో దళిత బంధు పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా, దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్తోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ను మంత్రి అభినందించారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేయర్ వై.సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వా ల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఆర్అండ్బీ ఎస్ఈ చందర్, ఈఈ సాంబశివరావు, నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ఉన్నారు.