జమ్మికుంట, అక్టోబర్ 13 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అనుబంధ సంఘం ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు రాజీనామా చేసి, 150 మంది అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి హుజూరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్రావు గూలాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, వీణవంక మండలం మల్లన్నపల్లి నుంచి బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు పోతరవేణి మహేందర్తోపాటు మరో 15 మంది యువకులు, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సం డ్ర వెంకటవీరయ్య గులాబీ కండువాకప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వీణవంక మండలం బేతిగల్కు చెందిన 30 మంది యువకులు ఉప సర్పంచ్ చొప్పరి తిరుపతి ఆధ్వర్యంలో వీణవంకలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.