ఢిల్లీ, జులై 2: దేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఉడాన్ కరోనా సెకండ్ వేవ్ లో తమ వేదికపై కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్ విక్రయాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. సేఫ్టీమాస్కులు, ఫేస్ షీల్డ్స్, పీపీఈ సూట్లుకు ఐదు రెట్లకు పైగా డిమాండ్ పెరిగిందని వెల్లడించింది.సెకండ్ వేవ్ సమయంలో15 మిలియన్ల కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్స్ విక్రయించినట్లు ఉడాన్ పేర్కొన్నది.23వేల ఆర్డర్ల ద్వారా 400 మందికి పైగా విక్రేతలు 5వేలపిన్కోడ్స్ వ్యాప్తంగా ఉడాన్ ద్వారా విక్రయించారు.
మార్చి నుంచి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గేవరకూ మొత్తంమ్మీద 6మిలియన్ల కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్స్ను అస్సాం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్లకు రవాణా చేశారు. ఈ రాష్ట్రాల్లోనే 50శాతానికి పైగా ఆర్డర్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ,అస్సాం రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఫేస్ షీల్డ్స్ ఆర్డర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఇన్ఫ్రారెడ్ ధర్మామీటర్లు విక్రయించగా,తర్వాతి స్థానాల్లో తమిళనాడు,పశ్చిమ బెంగాల్,బీహార్,ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. పీపీఈ కిట్ల డిమాండ్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా,తరువాత స్థానాలలో పశ్చిమ బెంగాల్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఒడిషా ఉన్నాయి.