నిర్మల్: జిల్లాలోని కొండాపూర్ బైపాస్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. నిర్మల్ గ్రామీణ పరిధిలోని కొండాపూర్ బైపాస్ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది (Overturn). ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్నది.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొండాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నిర్మల్ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.