అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,34,786కు పెరిగాయి. తాజాగా 1,248 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,06,034 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం 14,044 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 61,178 కొవిడ్ టెస్టులు నిర్వహించి కొత్త కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 288 మంది, చిత్తూరులో 217, కృష్ణాలో 155, ప్రకాశంలో 141, నెల్లూరులో 135, పశ్చిమ గోదావరిలో 126 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. కొవిడ్తో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు.