భోపాల్ : పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వేదాంత్ డాంగ్రే. ఇతనికి 13 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 21న బాలుడి తండ్రి రజత్ డాంగ్రే ఫోన్కు రాత్రి 7.27 గంటల సమయంలో కొవిన్ పోర్టల్ నుంచి ఫోన్కు మెసేజ్ వచ్చింది. వివరాలు చూసి కుటుంబమంతా షాక్ తిన్నది. అందులో ఉన్న సమాచారం ఏంటంటే.. రజత్ కుమారుడు వేదాంత్ డాంగ్రేకు కొవిడ్ టీకా వేసినట్లు కొవిన్ పోర్టల్ నుంచి మెస్సేజ్ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లకుపైబడిన వ్యక్తులకు మాత్రమే టీకా అందుబాటులో ఉంది. అంతకు తక్కువ వయస్సున్న వారికి టీకా అందుబాటులో లేదన్న విషయం అందరికీ ఈ విధితమే.
13 సంవత్సరాలున్న తన కుమారుడికి ఎప్పుడు? ఎక్కడ? ఎవరు ? టీకా వేశారని అయోమయానికి గురవుతున్నాడు. అయితే, పోర్టల్ నుంచి వచ్చిన అధికారిక మెస్సేజ్లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ పేర్కొన్నాడు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ (ప్రత్యేక అవసరాలు) కోసం ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువీకరణపత్రాలు అందజేశానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
కాగా, ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది తాము టీకాలు తీసుకోకున్న తమ సెల్ఫోన్ నంబర్లుకు టీకా తీసుకోకున్నా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వచ్చిందని ఆరోపించారు. వేదాంత్కు టీకా వేశామని చెప్పిన రోజున సైతం సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్లు వచ్చాయి. ఆ ముగ్గురూ ఎవరో కూడా తనకు తెలియదని తెలిపాడు. భోపాల్లో ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ రాకున్నా, ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా రాత్రి 10.57 గంటలకు మెసేజ్ వచ్చింది. వీరితో పాటు చాలా మంది ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఇప్పుడు తాము రెండు డోసుల వ్యాక్సిన్ను ఎలా తీసుకోవాలో తెలియకు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు రత్లంకు చెందిన టాక్స్కన్సల్టెంట్ ప్రేమ్ పాండ్యాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీకా కోసం పోర్టల్లో కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయినప్పటికీ.. వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లకున్నా అదే రోజున టీకా వేసుకున్నట్లు ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. దీనిపై ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. మరుసటి రోజు కేంద్రానికి రావాలని ఫోన్ వచ్చింది? అని ప్రశ్నించగా.. స్పందించలేదు. అయితే, వీటిపై వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్ మాట్లాడుతూ ‘అలాంటి సమస్య ఏదీ లేదు’ అని, దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. అయితే, ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీకా రికార్డు జిమ్మిక్కే తప్ప.. మరేమీ కాదని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా విమర్శించారు.