హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్ధిపేట జిల్లాలో అక్బర్పేట, భూంపల్లి, కుకునూరుపల్లి, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి , మహబూబ్నగర్లో కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్ సాలూరాను మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తుది నోటిఫికేషన్ జారీ చేశారు.