సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాయడానికి ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.