అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,184 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,46,841కు పెరిగింది. తాజాగా 1,333 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,19,657 మంది కోలుకున్నారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14,136కు చేరింది. 24 గంటల్లో 58,545 కొవిడ్ టెస్టులు జరిగాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 13,048 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రోజువారీ కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 218, చిత్తూరులో 165, గుంటూరులో 150, నెల్లూరులో 138, పశ్చిమ గోదావరిలో 126, కృష్ణాలో 116, ప్రకాశంలో 114 మంది పాజిటివ్గా పరీక్షించారు.