అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,174 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 20,08,639 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారితో 14,061 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 208, ప్రకాశంలో 161, చిత్తూరులో 159, కృష్ణాలో 140, గుంటూరులో 131, నెల్లూరులో 122 కేసులు రికార్డయ్యాయి. వైరస్తో గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, వైఎస్సార్ కడప, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.