అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు వైరస్ బారినపడి మృతి చెందారు. తాజాగా 1,487 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 55,307 కొవిడ్ పరీక్షలు జరిగాయి. మహమ్మారితో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 224, చిత్తూరులో 167, నెల్లూరులో 141, ప్రకాశంలో 130, పశ్చిమ గోదావరిలో 121, గుంటూరులో 110 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు.