అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,125 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కు పెరిగాయి. తాజాగా 1,356 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 20,03,543 మంది కోలుకున్నారు. మరో తొమ్మిది మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మరణాల సంఖ్య 14,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 210, నెల్లూరులో 184, కృష్ణాలో 164, పశ్చిమ గోదావరిలో 161, ప్రకాశంలో 110 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.