అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 52,319 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,115 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వైరస్ నుంచి 1,265 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మరో 19 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,14,116కు పెరిగింది. ఇప్పటి వరకు 19,85,566 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ బారినపడి 13,857 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210, కృష్ణా జిల్లాలో 165, పశ్చిమ గోదావరిలో 125, గుంటూరులో 121, ప్రకాశం జిల్లాల్లో 121 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో వివరించింది.