ఇందల్వాయి, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్టు ఎస్సై గౌరేందర్ గౌడ్ తెలిపారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 11.31 లక్షల నగదు అపహరించినట్టు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.