న్యూఢిల్లీ: ఇండియాలో ఇప్పటి వరకు 101 Omicron variant కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్రామ్ భార్గవ తెలిపారు.
యూరోప్లో భారీ స్థాయిలో corona virus కేసులు పెరుగుతున్నాయని, అక్కడ మహమ్మారి కొత్త దశ నడుస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి శ్యాంపిల్కు జీనోమ్ సీక్వెన్సింగ్ సాధ్యం కాదు అని డాక్టర్ పౌల్ చెప్పారు. అయితే వ్యూహాత్మక రీతిలో శ్యాంపిళ్లను పరిశీలిస్తున్నామన్నారు. Omicron వేరియంట్ను 91 దేశాల్లో గుర్తించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిందన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లో డెల్టాను ఒమిక్రాన్ దాటి వేస్తుందని ఆయన తెలిపారు.