నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొనుగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ..కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు.
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ పార్టీ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన అందరిని కుటుంబ సభ్యులవలె చూసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీం పాషా, మండల పార్టీ అధ్యక్షుడు అయిత గోని యాదయ్య, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, పొనుగోడు ఎంపీటీసీ, పులకరం అండాలు వెంకటేష్, మాజీ సర్పంచ్ క్షేత్రయ్య, సింగిల్ విండో చైర్మన్ పులకరం రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఉషయ్య, తదితులున్నారు.
పార్టీలో చేరిన వారిలో..
చాడ లింగస్వామి, ( విద్యా కమిటీ చైర్మన్ ), యాకాలపు అంజయ్య, వనం కిషన్, కట్టా సందీప్, కొంక నారాయణ, కొంక సైదులు, కట్ట సాయిలు, కట్ట పార్వతమ్మ, జోగు అంజయ్య, జోగు సువర్ణ, కాడింగు యమున, కొంక లింగమ్మ, గంట స్వామి, నిమ్మల యాదగిరి కొంక ఆంజనేయులు తదితరులు ఉన్నారు.