హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం రెండో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యూఎన్డబ్ల్యూజీసీ) సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించే ఈ సదస్సుకు 120 దేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సుకు హాజరయ్యేవారిలో 700కు పైగా అంతర్జాతీయ ప్రతినిధులుంటారని తెలిపారు. భారత జియోస్పేషియల్ ఎకానమీ 2025 నాటికి 12.8 శాతం వృద్ధిరేటుతో రూ.63,100 కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.