మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.