మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 79 వేల క్యూసెక్కుల వదర వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.90 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్టంగా 9.65 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 8.41 టీఎంసీల నీరు ఉన్నది.