లక్నో: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.