న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు కొత్తగా 2,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు. కరోనాతో ఒకే రోజు 10 మంది మరణించడంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఢిల్లీలో గత పది రోజుల నుంచి వరుసగా 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది. గురువారం రోజు ఆరుగురు మరణించగా, 2,726 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.