న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఒకేరోజు అంత ఎక్కువ మందికి కరోనా టీకా ఇవ్వడం ఇదే తొలిసారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1.94 కోట్లకు చేరిందని తెలిపింది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలవగా.. 49వ రోజైన మార్చి 5న మొత్తం 14,92,201 మంది కొవిడ్ టీకా తీసుకున్నారని ప్రకటించింది.