రంగారెడ్డి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ);మెరుగైన పారిశుధ్యంతో జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించిన పురపాలికలకు సర్కారు ప్రోత్సాహకం ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని బడంగ్పేట, తుర్క యాంజాల్, కొంపల్లి, ఆదిబట్ల, ఘట్కేసర్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా అవార్డులు పొందిన జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (ఎంసీఆర్హెచ్ఆర్డీ) మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అవార్డులు సాధించిన ప్రతి పట్టణ స్థానిక సంస్థకు రూ. రెండు కోట్ల చొప్పున అదనపు నిధులు కేటాయిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా, ఈ నిధులను పారిశుధ్యానికి మాత్రమే వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అవార్డు అందుకున్న ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ ఆర్తిక, కమిషనర్ అమరేందర్రెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి,కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్