కైరో: సూయజ్ కాలువ మధ్యలో చిక్కుబడి పోయిన ఎవర్ గివెన్ ఓడ బయటకు వెళ్లిపోయినా.. ఆ ప్రాంత ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నుంచి సూయజ్ కాలువలో ఉన్న కార్లు నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.
మూడు రోజుల క్రితం సూయజ్ కాలువకు ఇరువైపులా 300 పై చిలుకు ఓడలు నిలిచిపోయి ఉంటే.. ప్రస్తుతం 206 నౌకలు నిలిచి ఉన్నాయి.టగ్ బోట్ల సాయంతో ఎవర్ గివెన్ నౌకను కదిలించినప్పటి నుంచి ఇప్పటి వరకు 357 నౌకలు సూయజ్ కాలువను దాటాయి.
అయినా ఇప్పుడు కాలువ పొడవునా 420 పై చిలుకు షిప్లు పనామా వైపు వెళ్లడానికి వేచి ఉన్నాయి. సముద్ర మార్గంలో ఎవర్ గివెన్ వారం పాటు నిలిచిపోవడంతో ప్రతి రోజుకు వందల కోట్ల డాలర్ల బిజినెస్ స్తంభించిపోయింది.
వారం పాటు సూయజ్ కాలువకు ఇరువైపులా నౌకలు నిలిచిపోవడంతో కొన్ని నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆల్టర్నేటివ్ రూట్లో 5,000 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ రూట్లో బయలుదేరి వెళ్లాయి. దీనివల్ల ఇంధనం, ఇతర ఖర్చు వేల డాలర్లలో ఉంటుందని అంచనా.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఫ్యూచర్కు లైఫ్లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?