వనపర్తి, ఏప్రిల్ 7: పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ ఆదేశించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా గత వారం రోజులుగా వార్డు పర్యటన కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం పట్టణంలోని 18వ వార్డులో ప్రతి వీధిని పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నా రు. వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పనులను స్థానిక కౌన్సిలర్ సత్యమ్మ, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
కాంట్రాక్టర్లు సీసీ రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ప్రజలకు ఉపయోగపడేలా ఎక్కువ రోజులు వచ్చేలా నిర్మాణాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకు లు రహీం, పరంజ్యోతి, శరవంద, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.