కాచిగూడ,ఆగస్టు 27 : విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట ఏడీఈగా కె.సీనయ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మార్యాదపుర్వకంగా ఎమ్మెల్యేను కలిసారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బాధ్యలు చేపట్టినప్పటి నుండి హైదరాబాద్కే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా అంబర్పేట నియోజకవర్గంలో విద్యుత్కు అంతరాయం లేకుండానిరంతరం పర్యేవేక్షించాలని ఏడీఈ, ఏఈలకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో గోల్నాక ఏఈ డి.ప్రసాద్, రామాలయం ఏఈ ఎ.పృధ్వీ రాజ్, అంబర్పేట ఏఈ ఎ.మల్లేష్రాజ్, రామాలయం ఫోర్మెన్ టి.అంజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.