కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి
మహాగాంలో 8 జంటలకు పెళ్లి
మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టు వస్ర్తాల బహూకరణ
నూతన వధూవరులకు ఆశీర్వాదం
జైనూర్, మార్చి 12 : గ్రామాల్లో సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. సిర్పూర్(యు) మండలంలోని మహాగాం గ్రామంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో 8 జంటలకు పెళ్లి జరుగగా, జడ్పీ చైర్పర్సన్ తన తరఫున మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టు వస్ర్తాలను కానుకగా అందించారు. నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం గుట్టపై ఉన్న శివాలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావ్, సిర్పూర్(యు) ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తొడసం ధర్మారావ్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.