పెద్దపల్లి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)/ వేములవా డ/ జగిత్యాల రూరల్ అక్టోబర్21: ‘ఊరూరా ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం..నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభకు కార్యకర్తలందరినీ తరలించి సత్తా చాటుదాం..’అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్లెపల్లెనా పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వేములవాడ, మంథని, జగిత్యాల, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు ప్రతి కార్యకర్త హాజరయ్యేలా చూడాలని, ప్రతి నియోజకవర్గం నుంచి 8 వేల మందిని తరలించి విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, సంజయ్కుమార్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్లు పుట్ట మధూకర్, దావ వసంత, న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.
‘ఊరూరా ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం..నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభకు కార్యకర్తలందరినీ తరలించి సత్తా చాటుదాం..’ అని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పల్లెపల్లెనా పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వేములవాడ, మంథని, జగిత్యాల, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ర్టాన్ని సాధించిన తీరు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులందరిని సమన్వ యం చేసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి ఎనిమిది వేల మందిని తరలించి విజయవంతానికి కృషి చేయాలన్నారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల బాధ్యులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెల్లగోడ మీద నల్లటి గీతను భూతద్దంలో చూపినట్లు పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత విమర్శలకు దిగిన వారికి ఘాటుగా సమాధానమివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత, మానకొండూర్, జగిత్యాల, వేములవాడ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, డాక్టర్ సంజయ్కుమార్, రమేశ్బాబు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జడ్పీ అధ్యక్షులు న్యాలకొండ అరుణ, దావ వసంత, పుట్ట మధూకర్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, హరిచరణ్రావు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, బైరగోని లావణ్య, చంద్రయ్యగౌడ్, గంగం స్వరూపారాణి, రేవతి, రమాదేవి, జడ్పీటీసీలు యేస వాణి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు పొన్నాల శ్రీనివాసరావు, సుదవేణి లతా గంగాధర్, వొద్దినేని నాగేశ్వర్రావు, పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, మండలాల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, మల్యాల దేవయ్య, తిరుపతి, గడిల ప్రసాద్, సత్తిరెడ్డి, జగిత్యాల గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
2001 @ 2021 వద్ద సంబురాలు..
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత 2001 నుంచి 2021వరకు పార్టీ సాగించిన 20 ఏండ్ల ప్రస్థానాన్ని మంథని ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర చిత్ర పటంపై ఉన్న భారీ కటౌట్ వద్ద పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నేతలు జక్కు రాకేశ్, చల్లా నారాయణ, కొండా శంకర్, కొత్త శ్రీనివాస్, ఆకుల కిరణ్, శ్రీరాంభట్ల సంతోషిణి, జక్కుల ముత్తయ్య, తగరం శంకర్లాల్, ఆరెల్లి దేవక్క, కిషన్రెడ్డి, బెల్లంకొండ దయాకర్రెడ్డి, అత్తె చంద్రమౌళి, ఎక్కటి అనంతరెడ్డి, భాన్సోడ రాణిబాయి, చల్లా తిరుపతి, చెప్యాల రామారావు, దాసరి రాజలింగు, గొనె శ్రీనివాస్రావు, రాజిరెడ్డి, రాఘవరెడ్డి, శంకెసి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.