అమరావతి : గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరాయిన్ గుజరాత్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి హెరాయిన్ వెళ్తోందని పేర్కొన్నారు. ఆషీ కంపెనీ లైసెన్స్లో చిరునామా విజయవాడ పేరిట ఉందని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరుగడం లేదని స్పష్టం చేశారు. చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని పేర్కొన్నారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని సుధాకర్ చాలా రోజుల కిందటనే చెన్నైలో స్థిరపడ్డారని వివరించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 15న ముంద్రా పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. శరీర సౌందర్యానికి వాడే టాల్కమ్ పౌడర్ ముసుగులో అఫ్గానిస్థాన్ నుంచి ముంద్రా పోర్టుకు స్మగ్లింగ్ చేసినట్టు సమాచారం అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చిరునామాతో ఉన్న ఆషీ సంస్థ పేరిట దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ రవాణాపై డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.