లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-కాన్పూర్ హైవేపై ఆగి ఉన్న వ్యాన్ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. బస్సు కాన్పూర్ నుంచి ఆగ్రాకు వెళ్తుండగా.. ఛలేసర్ ఫ్లై ఓవర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. క్షతగాత్రులందరినీ చికిత్స కోసం తరలించినట్లు ఫీల్డ్ ఆఫీసర్ అర్చన సింగ్ తెలిపారు. జేసీబీ, క్రేన్ సహాయంతో బస్సు, ట్రక్కులను జాతీయ రహదారి నుంచి తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.