న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం జరుగుతోంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం టీకా డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 29,10,54,050 డోసులు అందజేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 8 గంటల వరకు అందించిన సమాచారం మేరకు వ్యర్థాలతో సహా 26,04,19,412 మోతాదులు వినియోగించినట్లు చెప్పింది. ఇంకా 3,06,34,638 మోతాదులు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. 24,53,080 డోసులు రాబోయే మూడు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది.