బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు.2019లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన “రాక్షసన్ కు తెలుగు రీమేక్గా రూపొందింది. 2019 ఆగస్టు 2న ఈ చిత్రం విడుదల కాగా, బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రస్తుతం రవితేజతో యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి చేస్తున్నాడు.
ఇప్పటికే ఖిలాడీ షూటింగ్ పూర్తి చేసిన రమేష్ వర్మ ప్రస్తుతం రాక్షసుడు 2 చేస్తున్నాడు. రాక్షసుడు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కనుండగా, త్వరలోనే మూవీ చిత్రీకరణ జరగనుంది. తాజాగా చిత్రానికి పోస్టర్ విడుదల కాగా, ఇందులో ఓ సైకో డెడ్ బాడీని తన భుజాలపై తీసుకొని పోతున్నట్టు కనిపిస్తుంది. సత్యనారాయణ కోనేరు చిత్రాన్ని నిర్మించనుండగా, గిబ్రాన్ సంగీతం అందించనున్నారు. ఇందులోను బెల్లంకొండ నే హీరోగా ఉంటాడా లేక మరెవరినైన తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.