లండన్ : గత నెలలో యూరప్లో కరోనా వైరస్ కేసులు ఏకంగా యాభై శాతం ఎగబాకడంతో యూరప్ తిరిగి వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. వ్యాక్సిన్ల సరఫరాలు అందుబాటులో ఉన్నా ప్రజలు పెద్దసంఖ్యలో వ్యాక్సినేషన్కు చొరవ చూపడం లేదని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జన్సీస్ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని యూరప్ అధికారులకు ఆయన పిలుపు ఇచ్చారు.
కొవిడ్-19 తిరిగి తలెత్తడం పట్ల డబ్ల్యూహెచ్ఓ యూరప్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జనాభాలో 40 శాతం పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలు తమ వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు విరాళంగా ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ కోరారు. రోగనిరోధక వ్యవస్ధ బలహీనంగా ఉన్నవారికి మినహా ఎవ్వరికీ బూస్టర్ డోసులు ఇవ్వరాదని పిలుపు ఇచ్చారు. కొవిడ్-19 తదుపరి వేవ్ తలెత్తవచ్చనే ఆందోళనతో 60కిపైగా దేశాలు బూస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించిన నేపధ్యంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.