హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించామని పేర్కొన్నారు. నూతన రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో 2021-22 వార్షిక బడ్జెట్ను మండలిలో ప్రవేశపెట్టేందుకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు మంత్రి వేముల సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందుకొన్నారు. కాగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థికమంత్రి హరీశ్రావు గురువారం ఉదయం శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి, బడ్జెట్ ప్రతులను అందజేశారు.