రాజాపేట, జూలై 13: వందల ఏండ్ల నాటి ఎంతో చరిత్ర కలి గిన మర్రిచెట్టు. చూడడానికి ఎంతో ఆసక్తికరంగా కన్పిస్తుంది. చెట్టు నిండా పచ్చని ఆకులతో దూరం నుంచి చూస్తే చిన్న కొం డ రూపాన్ని తలపిస్తుంది. ముప్పైయి గుంటల భూమిలో ఊడ లతో విస్తరించి ఉన్న చెట్టు కింద వందలాది మంది సులభంగా ఆశ్రయం తీసుకోవచ్చు.దూరం నుంచి చూస్తే ఆది ఓ పచ్చని గొడుగులా కనిపిస్తుంది.
బూర్గుపల్లి శివారులో
రాజాపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి కిలో మీటర్ దూరంలో 400 ఏండ్ల నాటి మర్రి వృక్షం 30 గుంటల భూమిలో వైశాల్యంలో ఊడలు విస్త రించి ఉంది. ఈ చెట్టు క్రింద పోచమ్మ దేవత వెలవ డంతో చెట్టుకు దేవత పేరును నామకరణంగావించి పోచమ్మ మర్రి అని పిలుస్తుంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో గ్రామస్తులు పోచమ్మ బోనాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మర్రిచెట్టు విస్తరించిన భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసు కొని చెట్టు సంరక్షణకు చర్యలు తీసుకుంటుంది. వందల ఏండ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టును చూడడానికి దూరం ప్రాంతాల నుంచి సైతం యాత్రికులు వస్తుంటారు.
పోచమ్మ మర్రిగా పిలుస్తాం
మా తాతాల కాలంలో చెట్టు వెలసిందని పెద్దలు చెప్తుంటా రు. వందల ఏండ్ల చరిత్ర కలిగి న ఇంత పెద్ద చెట్టు మా ఊరి శి వారులో ఉంది. మా వ్యవసా య పొలం సమీపంలో ఉన్న చె ట్టు వేర్లు పెరిగిన మేరకు భూమిని సాగు చేయకుండా వదిలే స్తున్నాం. చెట్టు కింద పోచమ్మ దేవత వెలసిఉండడంతో పోచ మ్మ మర్రిగా పిలుస్తుంటాం. ప్రతి శ్రావణ మాసంలో చెట్టు కింద ఉన్న పోచమ్మకు ఊరంతా కలిసి బోనాలు సమర్పిం చుకుంటాం. – మక్తాల లింగారెడ్డి, బూర్గుపల్లి