మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే తొందరపడండి. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్ను అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పాన్తో ఆధార్ అనుసంధానానికి పలుమార్లు గడువు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ డెడ్లైన్ విధించింది. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే రూ.10వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది. అందుకే గడువులోపు పాన్తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి.. రెండు విధాలుగా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..
మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 12 అంకెల ఆధార్ నంబర్ తర్వాత స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబర్ను ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి.
ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే ఆధార్తో పాన్ కార్డు లింక్ అవ్వదు. అలాంటప్పుడు ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న వివరాలను మార్చుకోవాలి. ఆ తర్వాత ఆధార్తో పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. ఆధార్లో వివరాలను యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లి మార్చుకోవచ్చు. ఒకవేళ పాన్ కార్డులో వివరాలను మార్చుకోవాలని అనుకుంటే https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారా మార్చుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి