కథలాపూర్, అక్టోబర్ 4: పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్స్టేషన్లో రైతు ఐక్యవేదిక నేతలు ఫిర్యాదు చేశారు. అర్వింద్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై రామచంద్రానికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు బద్దం మహేందర్రెడ్డి, మండల నాయకులు పూండ్ర జనార్దన్రెడ్డి, మామిడిపల్లి లింగారెడ్డి, తరి రమేశ్, ముస్కు శ్రీనివాస్రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.